జాతీయ వార్తలు
డ్రగ్ స్కాంలో నటి మమతా కులకర్ణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 June 2016
ముంబయి: రూ.2వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ కుంభకోణంలో బాలీవుడ్ నటి మమతాకులకర్ణి పేరును మహారాష్ట్ర పోలీసులు చేర్చారు. మమతా కులకర్ణికి ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే పది మంది అరెస్టయ్యారు. డ్రగ్ రాకెట్కు మమత, ఆమె భర్త విక్కీ ప్రధాన సూత్రధారులని తేలిందని థానే పోలీసు అధికారి పరమ్వీర్ సింగ్ వెల్లడించారు. కెన్యాకు చెందిన కులకర్ణి భర్త గోస్వామి డ్రగ్ మాఫియా కేసులో యూఏఈలో అరెస్టయ్యాడు. 2013లో వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో పోలీసులు డ్రగ్స్ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు.