తూర్పుగోదావరి

సత్యదేవుని హుండీల ఆదాయం రూ.కోటిపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, ఆగస్టు 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారికి హుండీల ద్వారా 28 రోజులకుగానూ రూ.1,04,38,186లు ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. రత్నగిరిపై గల స్వామివారి నిత్య కల్యాణ మండపంలో దేవస్థానం ఇఒ కాకర్ల నాగేశ్వరరావు సమక్షంలో హుండీలను దేవస్ధానం సిబ్బంది లెక్కించారు. హుండీల్లో 100గ్రాముల బంగారం, 680 గ్రాముల వెండితోపాటు నగదు రూ.98,98,676లు, నాణాలు రూ. 5,39,510లు లభించాయి. నగదులో బ్యాంక్ ఆఫ్ గుయనా 100డాలర్లు, యూరో 20, సౌది అరేబియన్ మోనెటరియా ఏజెన్సీ 109, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ 1/4 దినార్, 5ణ8352347 20, సౌత్ ఆఫ్రికన్ రిజర్వ్ బ్యాంక్ 70రాద్, ఝాన్‌ఘ్వా రిన్‌మిన్‌యిన్ 11న్, నెగర్ బ్రానెయిదరుస్సాయాన్ 1 డాలర్ లభించినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.