తూర్పుగోదావరి

జ్వరంతో గిరిజన విధ్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్ పురం, సెప్టెంబర్ 1: మండల పరిధిలోని అన్నవరం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి గొడ్ల కన్నయ్య (16) జ్వరంతో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. మృతుని బంధువుల తెలిపిన వివరాల ప్రకారం..కన్నయ్య స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చి కాళ్లు వాచాయి. రేఖపల్లి పిహెచ్‌సిలో వైద్యం చేయించారు. ఈ క్రమంలో బుధవారం కన్నయ్యకు మల, మూత్రలు బంద్ కావడంతో స్థానిక పిహెచ్‌సికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇదిలా ఉంటే మృతిచెందిన విద్యార్థి అన్నయ్య కూడా కాళ్లవాపు వచ్చి అనారోగ్యంతో బాధపడుతుండటం విశేషం. విద్యార్థి కన్నయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.