తూర్పుగోదావరి

దోమలపై దండయాత్ర విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంఅండ్ హచ్‌ఓ చంద్రయ్య కోరారు. ఈ మేరకు ఆయన కాకినాడ రూరల్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులులతో జరిగిన సమీక్షలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడుతుండటంతో దోమల వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలను తగ్గించుకోవచ్చని ఈ కార్యక్రమాలపై విద్యార్ధులచే ర్యాలీని నిర్వహించి తద్వారా ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పిల్లి సత్యనారాయమూర్తి, పండూరు పిహెచ్‌సి అధికారి ఐ ప్రభాకర్, ఎంపిడిఓ విశ్వనాధరెడ్డి, ఎంఇఓ విజయలత, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.