తూర్పుగోదావరి

ప్రత్యేక హోదాకు రాహుల్ సంపూర్ణ మద్ధతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సప్టెంబర్ 22: నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించినట్లు పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తెలిపారు. గురువారం రాత్రి ఆయన కాన్పూర్ నుండి ఫోన్‌లో ఆంధ్రభూమితో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో రాష్ట్ర ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించినట్లు గిడుగు తెలిపారు. విభజన ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈసందర్భంగా రాహుల్‌కు వివరిస్తూ నివేధిక అందించామన్నారు. ఈనెల 28న ప్రత్యేక హోదాపై నిర్వహించనున్న ప్రజా బ్యాలెట్ వివరాలను పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావులు రాహుల్‌కు వివరించినట్లు గిడుగు తెలిపారు. దీనిపై రాహుల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. అలాగే జిల్లాల వారీగా ప్రజా బ్యాలెట్‌పై నిర్వహణపై కూడా చర్చించినట్లు గిడుగు తెలిపారు.