తూర్పుగోదావరి

రేఖపల్లి పిహెచ్‌సి ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్ పురం, సెప్టెంబర్ 23: స్థానిక రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలను రంపచోడవరం పిఒ చక్రధరబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని రోగుల వార్డులను, ప్రశూతి గదిని, రక్త పరీక్ష గదిని పరిశీలించారు. రక్త పరీక్ష గదిలో టెస్టులు ఎలా చేస్తున్నది పరిశీలించారు. అనంతరం వైద్యులతో రోగులకు అందిస్తున్న సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంటింటికీ నిర్వహించిన హెల్త్ సర్వే రిపోర్టులను పరిశీలించారు. రానున్న పదిహేను రోజుల వరకు ఎవరూ విశ్రమించరాదని అన్నారు. కొత్తగా పంపించిన వైద్యులతో గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ గ్రామాల్లో సర్వేలు నిర్వహించాలని, ఆసుపత్రికి రాని రోగులకు గ్రామంలోనే వైద్యం అందించాలని అన్నారు. ఈయన వెంట తహసీల్దార్ జివిఎస్ ప్రసాద్, ఎంపిడిఒ సరోవర్‌రావు, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.