తూర్పుగోదావరి

పల్లెక్రాంతి ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగంపేట, సెప్టెంబర్ 23: మండలంలో పల్లెక్రాంతిని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఈలకొలను గ్రామంలో యుఆర్‌ఎ ట్యాంకును పరిశీలించారు. దానిని ఎప్పుడు క్లీన్ చేశారు?, గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంది?, డ్రెయినేజీల్లో పూడిక తీస్తున్నారా లేదా..అంటూ ఈలకొలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలో ఎస్టీ రాజాపురం, దొంతమూరు గ్రామాలను పెద్దాపురం డిఎల్పీవో వరప్రసాద్ పరిశీలించారు. వీరి వెంట తహసీల్దార్ రామారావు, ఇవో పిఆర్డీ సత్తిరాజు, పంచాయతీ కార్యదర్శి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో అన్ని పంచాయతీలలో గ్రామ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో దోమలపై దండయాత్రకు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ అవగాహనా సమావేశాలు నిర్వహించారు.