తూర్పుగోదావరి

అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సెప్టెంబర్ 27: మానసిక వికలాంగురాలైన మైనరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన కొప్పనాతి సతీష్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఇటీవల సూదాపాలెం ఘటనలో గాయపడిన కుటుంబాలను మంగళవారం కృష్ణమాదిగ పరామర్శించడానికి స్థానిక జానకీపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. వికలాంగురాలైన బాధితురాలికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఇంటి స్థలంతోపాటు గృహం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సూదాపాలెం ఘటనలో గాయపడిన బాధితులను కృష్ణమాదిగ పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మండా వెంకటేశ్వరరావు, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆకుమర్తి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న, కోనసీమ అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఐద్వా పట్టణ కార్యదర్శి టి నాగవరలక్ష్మి, సిపిఎం నాయకులు పి వసంతకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెనె్నపు దొరబాబు తదితరులు బాలికను పరామర్శించారు.