తూర్పుగోదావరి

అంబేద్కర్ విగ్రహం కళ్లకు గంతలు కట్టి అవమానించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, సెప్టెంబర్ 27: రామచంద్రపురం పట్టణంలోని ప్రధాన రహదారిపై నెలకొనియున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు అపచారం చేశారని, దానిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎంపిపి వినకోటి శ్రీనివాస్ మంగళవారం ఫిర్యాదుచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తాను తనకు సంబంధించిన ముఖ్యులతో మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి వెళ్తున్న సమయంలోమెయిన్‌రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశం జరుగుతోందని తెలిపారు. ఆ సమావేశంలో టేకుమూడి సత్యనారాయణ, అనిశెట్టి సత్యనారాయణమూర్తి అనే చంటి, మట్టా బాబులు, గాదంశెట్టి శ్రీ్ధర్, మేడిశెట్టి శ్రీనివాస్, యలమంచిలి సత్యనారాయణ, మేడిశెట్టి ఇజ్రాయేల్, బత్తుల అప్పారావు, దడాల రవికుమార్, వినకోటి శ్రీనివాస్ అనే కొండ, కుడుపూడి గణేష్, మందపల్లి చిట్టిబాబు, బొమ్ము మోహన రావు, దొమ్మలపాటి శ్యామ్ సుందర్, సత్తి శంకర రెడ్డి, పంతగడ రాజు, బి సిద్ధు, నామాటి రాజబాబు, యనమదల శ్రీను, చీకట్ల వెంకటేశ్వరరావులతో పాటు పలువురు, కె గంగవరం ఎంపిపి పెట్టా శ్రీనివాస్‌తో కలసి, దళితుల ఆశాజ్యోతి, నవరాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టి, అవమానకర రీతిలో ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబేద్కర్‌ను బహిరంగంగా అవమానించిన విధానం క్షమించరాని నేరమని, దళితులుగా జరిగిన సంఘటన తమను మనస్తాపానికి గురిచేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి అవమానాలు తమ వంటి దళితులకు ఆత్మహత్యా సదృశమని పేర్కొంటూ ఈ ఫిర్యాదు చేస్తున్నట్టు ఎంపిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతకుముందు సోమవారం ఏ విగ్రహానికైతే కళ్ళకు గంతలు కట్టారో అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపిపి వినకోటి శ్రీనివాస్, రవ్వా భూషణం, పోతురాజు భీమారావు, దేవానందం, తదితర ప్రముఖులు క్షీరాభిషేకం చేసారు.