తూర్పుగోదావరి

డీసీసీబీ ఛైర్మన్ రాజాకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, జనవరి 21: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్, అప్కాబ్ వైస్ ఛైర్మన్ వరుపుల జోగిరాజు(రాజా) పదవి కాలం పొడిగించడంతో ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పర్వత రాజబాబు వరుపులను ఆదివారం ఘనంగా సత్కరించారు. మండల కేంద్రం శంఖవరంలోని ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వరుపుల రాజాను మండల పరిషత్ అతిధి గృహంలో కలుసుకున్న పర్వత శభాకాంక్షలు తెలిపి దుశ్శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పర్వత మాట్లాడుతూ డీసీసీబీ ఛైర్మన్ల పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని, అనుభవఙ్ఞలైన ఛైర్మన్ల ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలందించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. మెట్ట ప్రాంతంలోని రైతులకు సకాలంలో రుణాలందించి ఆదుకోవాలని ఛైర్మన్ రాజాను పర్వత రాజబాబు కోరారు. అనంతరం టిడిపి అధికార ప్రతినిధి పర్వత సురేష్, ఎంపీటీసీలు పగడాల బాబ్జి, బైరా రాంబాబు రాజాకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు పాకల ప్రసాద్, ఈగల దేవుళ్ళు, బద్ధి రమణ, టీడీపీ నాయకులు ఈగల త్రిమూర్తులు, మేకల కృష్ణ, బొర్రా వాసు తదితరులు పాల్గోన్నారు.
జగన్‌ను కలిసిన ముమ్మిడివరం వైసీపీ కన్వీనర్ పితాని
ముమ్మిడివరం, జనవరి 21 : ప్రజా సంకల్పయాత్రను నిర్వహిస్తున్న వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహనరెడ్డిని ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ పితాని బాలకృష్ణ కలిసారు. ఆదివారం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో జగన్‌తోపాటు పితాని బాలకృష్ణ, నియోజవర్గానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నట్లు బాలకృష్ణ ఫోన్‌లో స్థానిక విలేఖర్లకు తెలిపారు.