తూర్పుగోదావరి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, ఏప్రిల్ 30: ట్రాక్టర్ ట్రాలీ, ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా ఇరువురు గాయపడిన సంఘటన మండలంలోని లొల్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాయవరానికి చెందిన కల్యాణి గనె్నమ్మ (58) రామచంద్రపురం నుండి ఆటోలో స్వగ్రామం వస్తుండగా లొల్ల సమీపానికి వచ్చేసరికి వెల్ల నుండి అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో లోడును దించి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీకి సంబంధించిన హుక్ విడిపోవడంతో ట్రక్కు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జనుజ్జయింది. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తుండగా, గనె్నమ్మకు తీవ్ర గాయం తగలడంతో ఆమెను స్థానికులు రాయవరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. మరో మహిళకు, ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు తగలడంతో రాయవరం ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి సూర్య అప్పారావు తెలిపారు.