తూర్పుగోదావరి
జగ్గంపేటలో క్రికెట్ టోర్నీ ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 June 2016
జగ్గంపేట, జూన్ 17: జగ్గంపేటలో నాళం గోపీ క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ఉదయం కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి తోట బ్యాటింగ్ చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విజేతలకు దాతలు జీను మణిబాబు, నాళం గోపి ఆర్థిక సౌజన్యంతో అందజేయబోయే బహుమతులను ఎంపి తోట తిలకించారు. కార్యక్రమంలో జగ్గంపేట ఎఎంసి ఛైర్మన్ ఎస్విఎస్ అప్పలరాజు, బండారు రాజా, ఎస్ ఎగపూర్ తదితరులు పాల్గొన్నారు.