తూర్పుగోదావరి

ముద్రగడ ఆరోగ్యం కోసం గోగులాంబకు ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూన్ 17: దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కోసం మండలంలోని గోపాలపురంలో శుక్రవారం కాపు సామాజిక వర్గీయులు గ్రామ దేవత గోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ అధికారి నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసు తదితర కాపునేతల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గీయులు ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించి ముద్రగడ ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ముద్రగడ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు సఫలమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ నాగేశ్వరరావు కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో కాపు నాయకులు యాళ్ల మునేశ్వరరావు, ఓదూరి శ్రీరాములు, గొర్రెల బాసు, గొర్రెల పటేల్, ఆకుల వెంకన్న, ఓదూరి దానయ్య, మీసాల సుబ్బారావు పాల్గొన్నారు.