తూర్పుగోదావరి

హైదరాబాద్ బాలికలు కాకినాడలో ప్రత్యక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, జూలై 21: హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో పాఠశాల నుండి బుధవారం అదృశ్యమైన ఇద్దరు బాలికలు వడకుర్తి మాధవి (13), వైష్ణవి (5) కాకినాడ రైల్వే స్టేషన్‌లో గురువారం ప్రత్యక్షం అయ్యారు. ఉదయం కాకినాడ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మాధవి, వైష్ణవిని బంధువులో కోసం స్టేషన్‌లో నిరీక్షిస్తున్న యానాంకు చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్యం గమనించారు. బాలికలను పిలిచి ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ నుండి వచ్చామని, ఎదుర్లంకలో మా మామయ్య ఉన్నారని మాధవి తెలిపింది. వెంటనే సుబ్రహ్మణ్యం వారిద్దరినీ ఎదుర్లలంక తీసుకువచ్చి మాధవి మేనమామ విత్తనాల వీరాస్వామి ఇంటివద్ద అప్పగించారు. కాగా హైదరాబాద్‌లో తప్పిపోయిన బాలికల వివరాలు తెలుసుకున్న ముమ్మిడివరం సిఐ కెటిటివి రమణారావు, ట్రైనీ ఎస్సై ఎదుర్లంక వచ్చి, బాలికలను గుర్తించారు. మేనమామ వీరాస్వామి, సిబ్బంది తోడుగా బాలికలను గురువారం సాయంత్రం హైదరాబాద్ పంపించారు.