తూర్పుగోదావరి

రత్నగిరిపై ఇద్దరు వ్రత పురోహితులు సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, జూలై 21: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామివారి సన్నిధి రత్నగిరిపై పనిచేస్తున్న వ్రత పురోహితులు ఇద్దరిని దేవస్థానం ఇఓ కాకర్ల నాగేశ్వరరావు గురువారం సస్పెండ్‌చేశారు. మొదటి శ్రేణి వ్రత పురోహితుడు మొక్కరాల రామకృష్ణ వైదిక నియమావళి పాటించడంలో అనుచితంగా ప్రవర్తించినట్టు గుర్తించారు. తృతీయ శ్రేణి వ్రత పురోహితునిగా పనిచేస్తున్న మొక్కరాల రవికిరణ్‌శర్మ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, సమయ పాలన సరిగా పాటించకపోవడం, అక్రమ పద్ధతిలో బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవడం వంటిఆరోపణల నేపథ్యంలో ఇరువురు వ్రత పురోహితులను సష్పెండ్ చేసినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు.