తూర్పుగోదావరి

కొండగుంటూరు, హెచ్‌బి కాలనీలో సబ్-స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజానగరం, జూలై 21: రాజానగరం మండలంలోని కొండగుంటూరు, హౌసింగ్ బోర్డు కాలనీలో రెండు సబ్ స్టేషన్లు మంజూరుకానున్నాయని రాజమహేంద్రవరం ఇపిడిసిఎల్ ఎస్‌ఇ వై ప్రసాద్ తెలిపారు. రాజానగరం మండలంలోని కానవరం గ్రామంలో రెండుకోట్ల 24 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన స్విచాన్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజానగరం మండలంలో లోవోల్టేజీ సమస్యను నిర్మూలించేందుకు నూతన సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఫైవ్ స్టార్ జనరేటర్ల పనితీరు బాగానే ఉందని, వాటిపై అపోహలు వద్దని సూచించారు. కొండగుంటూరులో స్థల సేకరణ జరిగిందని, హౌసింగ్ బోర్డు కాలనీలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతుందన్నారు. కానవరం సబ్‌స్టేషన్‌కు స్థలాన్ని సమకూర్చినవారికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే, శాసనసభ హామీల అమలు కమిటీ ఛైర్మన్ పెందుర్తి వెంకటేష్, డిఇ శ్యాంబాబు, జడ్పీటీసీ కె రత్నం, టిడిపి మండల అధ్యక్షుడు చంటిబాబు, మాజీ సర్పంచ్ బచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.