జాతీయ వార్తలు

అనూహ్య హత్య కేసు దోషికి ఉరిశిక్షే సరైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాను సనఫ్‌కు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. దేశంలో పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నిందితుడికి విధించిన శిక్ష సరైందేనని హైకోర్టు పేర్కొంది. ఏపీలోని మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబయిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆ యువతి 2013లో క్రిస్మస్ సెలవుల తరువాత తిరిగి ముంబయి వెళ్లిటానికి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. స్టేషన్‌లో దిగిన ఆమెను దొంగతనం చేయటానికి వచ్చిన చంద్రభాను సనఫ్‌తో ట్యాక్సీ మాట్లాడుకుంది. ట్యాక్సీ పనిచేయటం లేదని ఆమెను బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఆ తరువాత పెట్రోల్ పోసి హత్య చేశాడు. సీసీ కెమెరాల్లో ఈ దారుణ ఘటనలు బయటపడ్డాయి. సాక్ష్యాధారాలను బట్టి చంద్రభానుకు మహిళా న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. మరణ శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా ఉన్నత న్యాయస్థానం కూడా కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.