హైదరాబాద్

అసదుద్ధీన్ ఓవైసి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్: తీవ్రవాదులకు మద్దతుగా వాఖ్యలు చేసిన అసదుద్ధీన్ ఓవైసి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి దేశ ద్రోహ కేసు పెట్టి జైలుకు పంపాలని బజ్‌రంగ్‌దళ్ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం బజ్‌రంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వినర్ వై.్భనుప్రకాష్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొంత కాలంగా విహెచ్‌పి, బజ్‌రంగ్‌దళ్ పాతబస్తీలో ఐఎస్‌ఐ తీవ్రవాదులు మకాం వేశారని హెచ్చరిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విచారకరమైన విషయమని పేర్కొన్నారు. నేడు ఒక పెద్ద ప్రమాదం నుండి ఎఎన్‌ఐ అధికారులు నగర ప్రజలను కాపాడినందుకు బజ్‌రంగ్‌దళ్ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికైనాప్రభుత్వం మేల్కొని అసదుద్ధీన్ ఓఓసి లాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారితో ఎలాంటి రాజకీయ పొత్తు పెట్టుకోవద్దని హెచ్చరించింది. దేశద్రోహులకు న్యాయపరమైన సహకారాన్ని అందిస్తానని అటు లోక్‌సభ ప్రజలనే కాకుండా దేశ ప్రజలందరినీ అవమానపర్చిన దేశద్రోహి అసదుద్ధీన్ ఓవై అని విమర్శించారు. గతంలో కూడా మజ్లిస్‌పార్టీ నాయకులు అనుచిత చర్యలు దేశ విచ్చినానికి, సమగ్రతకు భంగం కల్గించేదిగా ఉన్నాయని, దేశంలోని అత్యధిక ప్రజలు కలిగిన వారి మత విశ్వాసాలపై వ్యాఖ్యలు చేశఆరని, ఓవై అనుత ప్రవర్తన వల్ల దేశంలో అశాంతిని చెలరేగే ప్రయత్నాలు చేస్తున్న మజ్లిస్ పార్టీని కూడా రద్దు చేయాలని పిలుపునిచ్చారు.