హైదరాబాద్

ఎన్టీపీసీ సదరన్ రీజియన్ వితరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ కార్యాలయం కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు విశేష సేవలు అందిస్తున్న వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ పరికరాలను పంపిణీ చేసింది. ఈ విషయాన్ని ఎన్టీపీసీ ప్రకటనలో పేర్కొంది. గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులకు ఈ పరికరాలను అందచేశారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ పరికరాలను అందచేశారు. ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ డిప్యూటీ జీఎం మదసు లింగయ్య ఇక్కడ జరిగిన కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్‌కు అందించారు. ఇప్పటికే ఎన్టీపీసీ రూ.250 కోట్లను ప్రధానమంత్రి కేర్స్ ఫండ్ కు అందచేసింది.