హైదరాబాద్

పాతబస్తీలో పర్యటించిన పోలీసు కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: పాతబస్తీలోని చార్మినార్, మదీనా, గుల్జార్‌హౌజ్ తదితర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం రాత్రి పర్యటించారు. రంజాన్ పండుగా సందర్భంగా సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని సిపి అధికారులను అదేశించారు. నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు.
నగరంలో రంజాన్, బోనాలు పండుగా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి రోజు షాపింగ్‌మాల్స్, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తామని తెలిపారు. పాతబస్తీ చార్మినార్, మదీనా, గుల్జార్‌హౌజ్, చూడిబజార్ తదితర ప్రాంతాల్లో పోలీసు కమిషనర్ పర్యటించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.