హైదరాబాద్

సాయిబాబా దేవాలయం కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్: దిల్‌సుఖ్‌నగర్ శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయం నూతన కమిటీ ఎన్నికైంది. గురువారం ఆలయంలో కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి అంబర్‌పేట్ ఎమ్మెల్యే వెంకటేష్, చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, సరూర్‌నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి హాజరై నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. ఆలయ చైర్మన్‌గా బీ.గంగాధర్, వైస్ చైర్మన్‌గా నరసింహ గుప్త, ఆర్‌ఎస్ శంకర రావు, అంకం లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శిగా వీవీ నాగేశ్వర రావు, కోశాధికారిగా బీవీ శ్యామల, సంయుక్త కార్యదర్శులుగా వి. బాబురావు, పద్మాకర్ ఆత్రే, లక్ష్మీదుర్గ, సభ్యులుగా శ్యామల రావు, కళ్యాణ్‌సాయి, శ్రీ్ధర్ ఎన్నికయ్యారు. చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ రాజు యాదవ్, కే.లక్ష్మయ్య, వనం రంగయ్య, వనం యాదయ్య, నరసింహ రావు పాల్గొన్నారు.