జాతీయ వార్తలు

నదిలో పడిన పెళ్లి బస్సు 15 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటార్సి, డిసెంబర్ 15: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో మంగళవారం పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు వంతెనపైనుంచి నదిలో పడిపోవడంతో ఏడుగురు మహిళలు సహా 15 మంది చనిపోగా, మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఇండోర్ నుంచి పరాసియా వెళ్తుండగా మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు సోహగ్‌పూర్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి సిద్ధార్థ్ సింగ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారినందరినీ భోపాల్, హోషంగాబాద్‌లలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించారని డివిజనల్ కమిషనర్ వికె బాతమ్ చెప్పారు. సోహగ్‌పూర్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని లోంగాబంజరి గ్రామం వద్ద బస్సు ఒక నది వంతెనను దాటుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తలా లక్షన్నర, గాయపడిన వారికి 50 వేలు, స్వల్ప గాయాలయిన వారికి పాతిక వేల పరిహారాన్ని ప్రకటించారు.
ప్రమాదం జరిగిన వెంటనే హోషంగాబాద్ జిల్లా కలెక్టర్ సంకేత్ భోండ్వే, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తుకొనసాగుతోందని పోలీసులు తెలిపారు.