జాతీయ వార్తలు
ఇరాన్ ఇంధన ట్యాంకర్పై మిస్సైళ్లతో దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 October 2019
న్యూఢిల్లీ: ఇరాన్కు చెందిన ఇంధన ట్యాంకర్పై దాడి జరిగింది. సౌదీ అరేబియాలోని జెడ్డాకు సమీపంలో ఈ దాడి జరిగింది. ఇరాన్కు చెందిన నేషనల్ ఆయిల్ కంపెనీ ఓడ భారీ ఇంధనంతో వెళతుండగా మిస్సైళ్లతో దాడి చేసినట్లు తెలిసింది. ఓడలో ఉన్న రెండు ప్రధాన చమురు స్టోరేజ్ ట్యాంక్లు తీవ్రంగా ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఎర్ర సముద్రంలోకి చమురు లీకవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలుకాలేదని ఇరాన్ వెల్లడించింది. మంటలను ఆర్పినట్లు ఇరాన్ పేర్కొన్నది. సౌదీ, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం
గమనార్హం.