జాతీయ వార్తలు

ప్రేమపెళ్లి చేసుకున్నందుకు సోదరిని సజీవ దహనం చేసిన అన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాలో ఒక 30 ఏళ్ల మహిళను ఆమె సోదరుడు, ఇతర సమీప బంధువులు సజీవ దహనం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె తొలిసారి తన కుటుంబ సభ్యులను చూడడానికి వచ్చినప్పుడు ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రకాశ్ సేవక్‌తో లేచిపోయిన రమా కన్వర్‌ను వారిద్దరి సంబంధం ఇష్టం లేని ఆమె సోదరుడు, ఇతర సమీప బంధువులు గత సోమవారం పచ్లసా గ్రామంలో సజీవ దహనం చేసినట్లు వారు చెప్పారు. వేరేచోట ఉంటున్న ఆ దంపతులు మొదటిసారి తమ కుటుంబ సభ్యులు, అత్తమామలను చూడడం కోసం గ్రామానికి వచ్చినట్లు పోలీసులు చెప్పారు. రమ భర్త ఇంట్లో లేని సమయంలో వారు ఆమెను ఇంట్లోనుంచి రోడ్డుపైకి లాగి సజీవంగా దహనం చేశారని పోలీసులు చెప్పారు.
అదేరోజు రాత్రే అంత్యక్రియలు కూడా నిర్వహించారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి రమ సోదరుడు లక్ష్మణ్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశామని పోలీసులు చెప్తూ, మిగతా వారిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.