జాతీయ వార్తలు

అత్యంత విషమంగా జైట్లీ ఆరోగ్యం:మాయావతి పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ వారం రోజులు నుంచి అరోగ్యం పూర్తిగా సహకరించకపోవటంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శ్వాస కూడా తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ఇదిలా వుండగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎయిమ్స్‌కు చేరుకుని జైట్లీని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్, కాంగ్రెస్ నేత అభిషేక్ సింగ్ తదితరులు ఎయిమ్స్‌కు వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.