జాతీయ వార్తలు

అనంత్‌నాగ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: అనంత్‌నాగ్ జిల్లాలోని పాజల్‌పురా ఏరియాలోని హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు సైనికులు చేతిలో హతమయ్యారు. బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కారనే సమాచారంతో భద్రతాబలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇరువైపులా భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా పాకిస్థాన్ కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. దీంతో ఉరి సెక్టార్‌లో ఓ సైనికుడు, షాపూర్ సెక్టార్‌లో అక్తర్ అనే మహిళ మృతిచెందారు. అలాగే నౌగామ్ సెక్టార్‌లో ఉగ్రవాదులు పెట్టిన మందుపాతర పేలి జవాను మృతిచెందాడు. గాందార్భల్ అడవుల్లో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.