జాతీయ వార్తలు

కాశ్మీర్ కోసమే పోరాటం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తమ పోరాటం కాశ్మీర్ కోసమేనని, కశ్మీరీలకు వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన రాజస్థాన్‌లోని టోంక్‌లో జరిగిన బహిరంగ సభలో శనివారంనాడు మాట్లాడారు. ఉగ్రవాదం వల్ల కశ్మీరీలు చాలా నష్టపోతున్నారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కశ్మీరులను కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి కశ్మీరీ బిడ్డకు అండగా ఉంటామని అన్నారు. కశ్మీరీలపై దాడులు జరుగకూడదని, అటువంటి దాడులు ఉగ్రవాదులకు ఊతమిస్తాయని చెప్పారు.