జాతీయ వార్తలు

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఖలిస్తాన్ ఉగ్రవాది బింద్రన్‌వాలే జయంతి సందర్భంగా గత నెల 12న లూధియానా (పంజాబ్)లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సంజయ్ సింగ్, భగవత్ మాన్‌లు కరపత్రాలు పంచారని, దీన్ని దేశద్రోహంగా పరిగణించాలని ఓ కేసు నమోదైంది. బింద్రన్‌వాలే సంస్మరణ సభకు ప్రచారం చేసినందుకు సంజయ్ సింగ్, భగవత్ మాన్‌లతో పాటు ఆప్ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ‘సమాజ్ జాగ్రతి’ అనే స్వచ్ఛంద సంస్థ లూధియానా కోర్టును ఆశ్రయించింది. దీంతో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలపై కేసులు నమోదు చేయాలని లూధియానా కోర్టు ఆదేశించింది. కేసు విచారణకు ఈ నెల 19కి వాయిదా వేశారు.