జాతీయ వార్తలు
ఆ ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించాలని సుప్రీం ఆదేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఇద్దరు మహిళలకు 24 గంటలూ రౌండ్ ద క్లాక్ సెక్యూర్టీ కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది. 50 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలు శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. దీంతో అయ్యప్ప సమితి ఆందోళనకారులు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ కల్పించాలని సుప్రీంలో ఓ పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన కోర్టు.. ఆ ఇద్దరు మహిళలకు కేరళ ప్రభుత్వమే పూర్తి రక్షణ కల్పించాలంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ స్పష్టం చేశారు.