ఖమ్మం

జిల్లాకు కొత్త చెక్‌పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 7: జిల్లాలో కొత్త చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లాలో పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఆర్‌టిఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 49ఆర్‌టిఏ కార్యాలయాలు ఏర్పాటు చేయటంతో పాటు 12ఎంవిఐ కార్యాలయాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్‌టిఏ సేవలు వినియోగదారులకు మరింత చేరువ చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తాము ఎల్లప్పుడు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నుంచి ఏడాదికి 25శాతం చొప్పున జరిమానాల ద్వారా ఆదాయం పెరిగిందన్నారు. విలేఖరుల సమావేశంలో ఆర్‌టిఏ మోమిన్, ఏవో కృష్ణారెడ్డి, ఎంవిఐలు బజాజ్, శ్రీనివాస్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.