ఖమ్మం

పిఆర్‌సిని వెంటనే చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2013 నూతన వేతన సవరణ ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్‌సి బకాయిలను తక్షణమే చెల్లించాలని టిఎన్‌యుఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిరిశాల వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జివి సూర్యప్రకాశ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 నెలలుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన సవరించిన వేతనాలను చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. జూన్ 2014 నుంచి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా 2015 ఫిబ్రవరి నుంచి ఉద్యోగులకు చెల్లించి బకాయిలను నిలుపుదల చేయడం దారుణమన్నారు. ఉన్నత పాఠశాలలకు ప్రథమశ్రేణి పండితులు, వ్యాయమ ఉపాధ్యాయ పోస్టులను ఆధునికరించాలని కోరారు. ఈ సమావేశంలో చావా రాజేంద్రప్రసాద్, మచ్చా అజయ్‌బాబు, లకావత్ కోటేశ్వరరావు, చామకూరి పుల్లయ్య, రాయల శ్రీనివాస్, పొలూరి సత్యనారాయణ, ఆలస్యం నాగేశ్వరరావు, భాస్కరరావు, సుల్తానా పాల్గొన్నారు.