ఖమ్మం

రైలు నుంచి జారిపడి యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, జూలై 4: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇంటర్‌సిటి రైలు నుంచి యువతి జారి పడి మృతి చెందిన సంఘటన గార్ల రైల్వే స్టేషన్ సమీపంలోని పాకాల ఏరు వంతెన వద్ద సోమవారం చోటు చేసుకుంది. సుమారు ఇరవై సంవత్సరాల వయస్సు లోపు కలిగి ఉన్న యువతి గోధుమ రంగు ఛాయ కలిగి శరీరంపై నీలి రంగు దుస్తులు ధరించి ఉంది. స్థానికుల కథనం ప్రకారం గార్ల పాకాల ఏరు వంతెన వద్ద మూలమలుపు ఉండటం, యువతి రైలు పెట్టె తలుపు వద్ద నిలబడి ఉండగా హైస్పీడుగా వెళ్ళుతున్న రైలు తలుపునెట్టుకోని వచ్చి అమెకు తగలటంతో జారి పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలు వేగంగా ఉండడంతో జారిపడిన వెంటనే మృతి చెందవచ్చుననే ఆనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఏ ప్రాంతానికి చెందినదో అనే విషయం పోలీసు విచారణలో తెలాల్సి ఉంది. కేసును డోర్నకల్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.