జాతీయ వార్తలు
ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నం:కుమారస్వామి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 8 February 2019
కర్ణాటక: డబ్బులు ఎరవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. బీజేపీ నేత యడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్నగౌడ్కు 25 లక్షల రూపాయలు ఎరవేశారని దీనికి సంబంధించిన ఆడియో టేపును ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడ్ కుమారుడు కరణ్కు యడ్యూరప్ప ఫోన్ చేసి రూ.25 లక్షలు, నాన్నకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన మాటల ఆడియోను సీఎం విడుదల చేశారు. వీటన్నింటిని ఆధారాలతో సహ చూపిస్తామని, ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు కనబడటం లేదని అన్నారు. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు.