జాతీయ వార్తలు

లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్టప్రతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పాల్గొన్నారు. లోక్‌పాల్‌ జ్యూడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్ కుమార్. నాన్ జ్యూడీషియల్ సభ్యులుగా దినేష్ కుమార్ జైన్, అర్చనా రామసుందరం, మహేందర్ సింగ్, ఇందరజిత్ ప్రసాద్ గౌతమ్ నియమితులైన విషయం తెలిసిందే