జాతీయ వార్తలు
మహారాష్టల్రో వచ్చేది తమ కూటమి సర్కారే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 November 2019
ముంబయి: మహారాష్టల్రో వచ్చేది శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమేనని ఎన్సీపీ అధినేత శరద్పవార్ అన్నారు. ఆయన కరాడ్లో మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ను సస్పెండ్ చేసే విషయం తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను అజిత్ పవార్తో టచ్లో ఉన్నాననే విషయాన్ని ఆయన ఖండించారు. బీజేపీతో చేతులు కలిపింది తన సోదరుడు కుమారుడు అజిత్ పవార్ తప్ప ఎన్సీపీ కాదని ఆయన స్పష్టం చేశారు. నా యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటివి ఎన్నో చూశానని, ఇవన్నీ తాత్కాలికమేనని అన్నారు. మహారాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి యశ్వంత్రావు చవాన్ వర్థంతి సందర్భంగా ఆయన స్మారకం ప్రీతీ సంగమ్ వద్ద నివాళులర్పించారు. పవార్ వెంట సతారా ఎంపీ శ్రీనివాస్ పాటిల్ ఉన్నారు.