జాతీయ వార్తలు

మనోరమకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: సంపూర్ణ మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కొన్నాళ్లుగా జైలులో ఉంటున్న జెడియు ఎమ్మెల్సీ మనోరమా దేవికి పాట్నా హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. గయలోని జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు రెండుసార్లు నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మనోరమ కుమారుడు రాకీ యాదవ్ గయలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని రివాల్వర్‌తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. రాకీ యాదవ్ కోసం గాలిస్తుండగా మనోరమ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇదివరకే ప్రకటించారు. మనోరమ కుమారుడు రాకీతో పాటు ఆమె భర్త కూడా పలు కేసులను ఎదుర్కొంటున్నారు.