జాతీయ వార్తలు

మాయావతిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: తనను, తన కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నారని బిఎస్‌పి అధినేత్రి మాయావతిపైన, ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలపైన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తన భర్త దయాశంకర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, అయినప్పటికీ తనను, తన 12 ఏళ్ల కుమార్తెను బిఎస్పీ కార్యకర్తలు వేధిస్తున్నారని స్వాతి ఆరోపించారు. తన ఇంటికి వచ్చి బయటకు గెంటివేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. తండ్రి తప్పు చేస్తే కుమార్తెను, భార్యను హింసిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు ఇంట్లో భద్రత కరవైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.