జాతీయ వార్తలు
కులం పేరుతో విడగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 November 2018
చత్తీస్గఢ్: కులం పేరుతో దేశ ప్రజలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన బిలాస్పూర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరంభం, ముగింపు కూడా వారసత్వంతోనే నడుస్తుందని ఆయన అన్నారు. మావోయిస్టులకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను విప్లవకారులు అని ప్రధాని విమర్శించారు. నోట్ల రద్దును ఆయన సమర్థించారు. గతంలో భారీస్థాయిలో ఇళ్లలో నగదును దాచుకున్నారు. నోట్ల రద్దు తరువాత ఆ నగదు అంతా బయటకు వచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటం ఒక బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు.