జాతీయ వార్తలు

విగ్రహాల ధ్వంసంపై మోదీ ఆగ్రహాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విగ్రహాల ధ్వంసంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యంకాదని ఆయన పేర్కొన్నారు. త్రిపురలో రష్యా కమ్యూనిస్టు పార్టీ నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయటంతో ఆక్కడ అల్లర్లు చెలరేగిన విషయం విదితమే. తాజాగా తమిళనాడులో సంఘ సంస్కర్త ఈవీఆర్ రామస్వామి విగ్రహాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయటంతో అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కొయంబత్తూర్ బిజెపి కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రధాని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.