జాతీయ వార్తలు

పెళ్లి చేయలేదని తల్లికి నిప్పంటించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తనకు పెళ్లి చేయడం లేదన్న ఆగ్రహంతో కన్నతల్లి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఓ కుమారుడి ఉన్మాదం ఇది. తమిళనాడులోని అరుంబాక్కంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అమర్‌నాథ్ (40) అనే క్యాబ్ డ్రైవర్ తనకింకా పెళ్లి చేయడం లేదని తల్లి శశికళతో తరచూ గొడవపడేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అమర్‌నాథ్ తల్లిని కుర్చీకి కట్టేసి ఆమెకు నిపుపెట్టాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిపై కన్నకొడుకు ఇంత కిరాతకంగా ప్రవర్తించి ఆమె ప్రాణాలను బలితీసుకోవడం స్థానికుల్లో విషాదాన్ని నింపింది.