జాతీయ వార్తలు
జెఎన్యు ఎన్నికలు.. సిఇసిగా మహిళ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 August 2016
న్యూఢిల్లీ, ఆగస్టు 28: వివాదాలతో అట్టుడికిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల నిర్వహణకు తొలిసారి ఒక మహిళ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. జెఎన్యుఎస్యు నిర్వహించిన సమావేశంలో సిఇసిగా స్కూల్ ఆఫ్ సోషల్ సైనె్సస్ ఎస్ఎస్ఎస్కు చెందిన పిహెచ్డి ప్రథమ సంవత్సర విద్యార్థిని ఇషితా మనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాజీ సిఇసి దిలీప్ వౌర్య తెలిపారు. ఎన్నికల కమిటీ సారథిగా మహిళను ఎన్నుకోవడం జెఎన్యు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కమిటీ త్వరలోనే సమావేశమై ఎన్నికల తేదీలను ఖరారు చేయనుంది. దీంతో సెప్టెంబర్లోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.