జాతీయ వార్తలు
విద్యార్థి కిడ్నాప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భద్రాచలం, నవంబర్ 13: చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని మావోయిస్టులు ఆదివారం అతని స్వగ్రామంలో కిడ్నాప్ చేశారు. జిల్లా పరిధిలోని కామ్కానార్ గ్రామానికి వచ్చిన విద్యార్థి సంతోష్ బొడ్డే వారపు సంతకు వెళ్లగా అక్కడి నుంచి నక్సల్స్ అపహరించుకు పోయారు. కిడ్నాప్నకు కారణాలు తెలియరాలేదు. విద్యార్థికి ఎటువంటి హాని తలపెట్టొద్దని కామ్కానార్ గ్రామస్థులు నక్సల్స్కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
విద్యార్థి కిడ్నాప్ ఉదంతం చత్తీస్గఢ్ రాష్ట్రంలో కలకలం రేపింది. ప్రభుత్వం కూడా దీనిపై ఆరా తీస్తోంది. విద్యార్థిని క్షేమంగా నక్సల్స్ చెర నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
కిడ్నాప్నకు గురైన విద్యార్థి సంతోష్ బొడ్డే (ఫైల్ ఫొటో)