జాతీయ వార్తలు
ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 November 2016
న్యూఢిల్లీ, నవంబర్ 18: ఏపీకి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేంద్రాన్ని కోరారు. శుక్రవారం లోక్సభ జీరోఅవర్లో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసి రెండున్నర నెలలు కావస్తోందని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలు తమను బాధించాయని, అలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలన్నీ లిఖిత పూర్వకంగా ఉండాలని, వాటికి పార్లమెంట్ ఆమోదం తెలపాలని కింజరపుడిమాండ్ చేశారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికే రెండునెలలు పూర్తయిందని, పైగా దానిలో స్పష్టత లేదని ఎంపీ పేర్కొన్నారు.