జాతీయ వార్తలు
సుష్మాకు నా కిడ్నీ ఇస్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 November 2016
న్యూఢిల్లీ, నవంబర్ 18: మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు కిడ్నీ ఇవ్వడానికి టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావు ముందుకొచ్చారు. ఈమేరకు శుక్రవారం ఆయన సుష్మాస్వరాజ్కు లేఖ రాశారు. కిడ్నీల సమస్యతో సుష్మా స్వరాజ్ గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్సపొందుతున్నారు. తనకు డయాలసిస్ చేస్తున్నట్టు మంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. కిడ్నీలు మార్చడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. కాగా మధ్యప్రదేశ్కు చెందిన ఓ కానిస్టేబుల్ సుష్మా స్వరాజ్కు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావుకూడా విదేశాంగ మంత్రికి కిడ్నీ ఇస్తానని ప్రకటించారు.