జాతీయ వార్తలు

వేడెక్కనున్న వారణాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, ఫిబ్రవరి 27: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఎన్నికల ప్రచారంతో వేడెక్కనుంది. ఈ నెల 27న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీ సిఎం అఖిలేశ్ యాదవ్ రోడ్‌షో నిర్వహించనున్నారు. రోడ్‌షోను విజయవంతం చేయడానికి ఇరుపార్టీల కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో వారణాసి లోక్‌సభ ఉంది. మార్చి 8న అక్కడ ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిఎం అఖిలేశ్ యాదవ్ రోడ్‌షోకు సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీశ్ రాయ్ వెల్లడించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ యూపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. రెండు మూడు రోజుల్లో ఇక్కడకు వచ్చి రోడ్‌షో ఏర్పాట్లు పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. బిజెపి కూడా వారణాసిలో పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించింది. తూర్పు జిల్లాల్లో పర్యటన ముగించుకున్న తరువాత బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడకు వచ్చి ఎన్నికల సభల్లో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.