జాతీయ వార్తలు

షారుఖ్‌కు యశ్ చోప్రా అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, ఫిబ్రవరి 26: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ ‘యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్’ను అందుకున్నారు. శనివారం ముంబైలో కన్నుల పండువగా జరిగిన కార్యక్రమంలో షారుఖ్ ఖాన్‌కు టి.సుబ్బిరామిరెడ్డి ఈ అవార్డును అందజేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు, ప్రముఖ నటి రేఖ, శతృఘ్న సిన్హా, మాధురీ దీక్షిత్, జయప్రద, పద్మినీ కొల్హాపురి తదితరులు ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ విద్యాసాగర్‌రావుతో పాటు రేఖ, శతృఘ్నసిన్హా, జయప్రద తదితరులు షారుఖ్‌ఖాన్ నట జీవన ప్రస్థానాన్ని కొనియాడారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ గొప్పతనాన్ని, బాలీవుడ్‌లో ఇరవై ఐదేళ్ల సినీ ప్రయాణంలో స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ సాధించిన ఘనత గురించి తెలిపారు. ఏప్రిల్ 8న టిఎస్‌ఆర్, టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం విశాఖపట్నంలో జరుపుతున్నామని, ఆ వేడుకలో ‘మిలీనియం స్టార్ అవార్డు’ను షారుఖ్ ఖాన్‌కు అందజేయబోతున్నామని టి.సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ఆ అవార్డును విశాఖలో అందుకోబోవడం ఆనందంగా ఉందని షారుఖ్ అన్నారు. భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహిస్తున్న టి.సుబ్బిరామిరెడ్డిని గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అభినందించారు. సుబ్బిరామిరెడ్డి ప్రారంభించిన యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు ఇవాళ ప్రతిష్ఠాత్మకమైనదిగా పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు ఇంత వరకూ వరుసగా సినీ దిగ్గజాలు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రదానోత్సవంలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, హీరో హీరోయిన్లు పాల్గొన్నారు.

చిత్రం..యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును స్వీకరిస్తున్న షారుఖ్ ఖాన్