జాతీయ వార్తలు

బిఎస్పీ పోస్టర్లపై నేరగాళ్ల బొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలియా, ఫిబ్రవరి 27: ఉత్తరప్రదేశ్‌లో గూండారాజ్యాన్ని పారదోలతానని బిఎస్పీ అధినేత్రి మాయవతి ఇచ్చిన హామీని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఎద్దేవా చేశారు. పేరు మోసిన నేరగాళ్లు ముక్తార్ అన్సారీ, అతడి సోదరుడు అఫ్జల్ ఫొటోలు పోస్టర్లలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్న బిఎస్పీకి గూండా రాజ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని షా విరుచుకుపడ్డారు. సోమవారం ఇక్కడ ఓ ఎన్నికల సభలో ప్రసంగించిన అమిత్‌షా ‘గూండా రాజ్యం పారదోలతానని మాయావతి చెబుతారు. బిఎస్పీ అభ్యర్థుల పోస్టర్లపై ముక్కార్ అన్సారీ, అఫ్జల్ అన్సారీ బొమ్మలు దర్శనం ఇస్తాయి’ అని అన్నారు. అన్సారీ ఇటీవలే బిఎస్పీలో చేరి మావు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడని షా తెలిపారు.