జాతీయ వార్తలు
రాష్టప్రతితో గవర్నర్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 February 2017
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం అయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్టప్రతితో పాటు, హోంశాఖ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. గవర్నర్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్టప్రతితో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి సంస్థల విభజనకు రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన కమిటి గురించి రాష్టప్రతి, హోంశాఖ అధికారులతో గవర్నర్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. గవర్నర్ మంగళవారం కేంద్ర హోంమంత్రితో పాటు అధికారులను కలిసే అవకాశం ఉంది.