జాతీయ వార్తలు

ముస్లింలనూ దహనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తాల్లోకెక్కే బిజెపి ఎంపీ సాక్షి మహారాజ్ ముస్లింలపై మరోసారి కొత్తరకం వ్యాఖ్యలతో తాజా చర్చకు తెరతీశారు. దేశంలో ముస్లింల సంఖ్య దాదాపు 20 కోట్లకు చేరుకుందని, వీరందరినీ ఖననం చేయడానికి దేశంలో స్థలం ఎక్కడుందని, అందుకే చనిపోయిన ముస్లింలను కూడా దహనం చేయాలని వ్యాఖ్యానించారు. దేశంలో 2 నుంచి 2.5 కోట్ల మంది హిందూ సాధువులున్నారని, వారికి ఎలాగూ స్మారకాలను నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. అటువంటప్పుడు 20 కోట్ల మంది ముస్లింల ఖననానికి స్థలం ఎక్కడ దొరుకుతుందని సోమవారం ఉన్నావ్ జరిగిన ఒక సభలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బిజెపి ఎంపీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.