జాతీయ వార్తలు
రాష్టప్రతితో మలేసియా ప్రధాని భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఆరు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేసిన మలేసియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ శనివారం న్యూఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీని కలుసుకున్నారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. రాష్టప్రతి భవన్లో మోదీ తనకు అధికారికంగా సాదర స్వాగతం పలికారని రజాక్ ట్వీట్ చేశారు. రాష్టప్రతి భవన్లో గౌరవ వందనాన్ని స్వీకరించిన రజాక్ రాజ్ఘాట్ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు.
మార్చి 30వ తేదీన భారత్కు విచ్చేసిన రజాక్ తన తొలి విడత పర్యటనలో చెన్నైకి వెళ్లి అక్కడ మలేసియా విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు తమిళ మెగాస్టార్ రజనీకాంత్ను కలుసుకున్నారు. భారత పర్యటన సందర్భంగా రజాక్ రాజస్థాన్లోని జైపూర్ను కూడా సందర్శించనున్నారు.
చిత్రం ...ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్